విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగల్లో ఒక ఘట్టం శ్రీ శ్రీరామారావు మాస్టారి మాటల్లో:
ఒక మేఘం వానకాలంలో సంచరిస్తూ ఒక పెద్దచెట్టుని కౌగలించుకొని ఆనందబాష్పాలు కార్చేది.
ప్రతిసంవత్సరం వారి చెలిమి చాల దృడమైనది. ఏళ్లతరబడి సాగుతున్నవారి చెలిమికలిమితరగనిగని!
నాగరకత పెరిగింది. ఆ సుబ్బన్నపేట నెమ్మదిగా పట్టణాలవంకచూడసాగింది.
చెట్టునికొట్టి కరెంట్ పోల్ వచ్చింది --- ఆదేశంగా!!!
వానకాలంవచ్చింది. మన వృద్ధమేఘమూ వచ్చింది.
ఆ ప్రాంతమంతాకలయతిరిగింది.
ఎక్కడ తన ఆప్తవృద్ధమిత్రుని జాడకానరాలేదు.
వెదకివేసారి మళ్ళీ ఈ ప్రాంతానికి రానక్కర్లేదని బాధపడింది..
మ్రోడువారినయెదలోనుండి కార్చకన్నీరులేక నిట్టూర్పులతో నిష్క్రమించిందా మేఘం!!!!
పై భావాన్ని ఆటవెలదుల్లో ప్రయత్నించాను..!
జలదమొకటి మిన్ను సంచరించుచు పెద్ద/
తరువు చేరె ప్రేమ ధార కురియ!
నా యిరువురి మధ్య ననుబంధమేర్పడి/
యెంతయో బలపడె నేటికేడు!
కాల మహిమ నకట గ్రామమ్ము పట్నమై/
తరువు తొలగి వెలసె స్తంభమొకటి!
వర్ష ఋతువునందు వచ్చుమేఘము తన/
చనవరి కనరాక చకితుడయ్యె!
వెదకి యలసిసొలసె, వృద్ధమిత్రుని జాడ/
తెలియరాక మబ్బు దిగులు చెందె!
నిలువలేక నచట నిట్టూర్చి జలదమ్ము/
మరల రాననుచును మరలి పోయె!
చెట్టులేని తావు ’చినుకుదారి’క* రాదు/
తానులేక చిగురు దాల్పదు తరు/
విట్లు బంజరయ్యె వేడిగాడ్పులనూరు!
కార్చ కంటనీరు గగనమయ్యె!
*చినుకుదారి - మేఘము - ఇకరాదు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి